కల్ట్ బ్లాక్ బస్టర్ "బేబి" కాంబో రిపీట్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా అమృత ప్రొడక్షన్స్,మాస్ మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త సినిమా ప్రకటన

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది "బేబి" సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్,"కలర్ ఫొటో"తో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న బ్యానర్ అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

"బేబి" సినిమాను యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందించి మెగాస్టార్ చిరంజీవి నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ కేఎన్ తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు.నూతన దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సమ్మర్ లో థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు - ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

టెక్నికల్ టీమ్ 

డీవోపీ - బాల్ రెడ్డి
మ్యూజిక్ - విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ - విప్లవ్
బ్యానర్స్ - అమృత ప్రొడక్షన్స్,మాస్ మూవీ మేకర్స్, 
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా,వంశీ కాక
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు - ఎస్.కే.ఎన్, సాయి రాజేష్
కథ, స్క్రీన్ ప్లే,మాటలు - సాయి రాజేష్ 
దర్శకత్వం - రవి నంబూరి

No comments