‘కలియుగం పట్టణంలో’ నిలుపుదల.. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామన్న నిర్మాతలు


నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29 విడుదలైంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి ప్రశంసలను అందుకుంది.

ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. విమర్శకుల ప్రశంసలు కూడా ఈ మూవీకి వచ్చాయి. విశ్వ కార్తికేయ నటన అందరినీ ఆకట్టుకుంది. నూతన దర్శకుడైనా కూడా ఆయన రాసుకున్న కథ, సినిమాను తీసిన విధానానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని నిలిపి వేస్తున్నారు. మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు.

No comments