గంగా ఎంటర్టైన్మెంట్స్ 'శివం భజే' సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్టు 1న గ్రాండ్ విడుదల!!


గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.

పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి.

న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు హైలైట్ అవ్వనున్నాయి.

తారాగణం:

అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
 
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ 
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.

No comments