కేరళ కొండచరియల సహాయ కార్యక్రమాలకు ఫండ్స్ డొనేట్ చేసిన యాక్టర్స్ సూర్య, జ్యోతిక &కార్తీ


కేరళలోని వాయనాడ్ జిల్లా భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రాంతంలోని అనేక గ్రామాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రకృతి విలయం యావత్ దేశాన్ని కలిచి వేసింది. ప్రస్తుతం NDRF, ఆర్మీ, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కేరళ సహాయ కార్యక్రమాల్లో సహాయం చేయడానికి, యాక్టర్స్ సూర్య, జ్యోతిక & కార్తీ రూ. 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. కేరళల ప్రజలకు తమ సానుభూతిని తెలియజేశారు.

No comments