'ఆహా' ఓటీటీలో ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "కాళరాత్రి"


బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "కాళరాత్రి". ఈ చిత్రాన్ని హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించారు. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన కాళరాత్రి సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. 

"కాళరాత్రి" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - 266 ఎకరాలను అతి తక్కువ ధరకు కొనేందుకు వెళ్లిన స్నేహితుల బృందం ఆ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఎంతో అందంగా ఉన్న ఆ గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుంటారు. ఆ భవనంలో అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. వారిలో కొందరు చనిపోతారు. ఆ హత్యలకు కారణం ఎవరన్నది అంతు చిక్కదు. ఇలాంటి ఆసక్తికర మలుపులతో ట్రైలర్ ఆకట్టుకుంది. వీళ్లు ఎందుకు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కాళరాత్రి సినిమా బాగా నచ్చుతుంది.

నటీనటులు - బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు 

టెక్నికల్ టీమ్

బ్యానర్ - హనుమాన్ మీడియా
పీఆర్ఓ - పవన్ పాల్
ఓటీటీ - ఆహా
నిర్మాత బాలు చరణ్
రచన, దర్శకత్వం - మర్ఫీ దేవసి

No comments