హీరో సుమన్ చేతుల మీదుగా"ఝాన్సీ ఐపీఎస్" ట్రైలర్ లాంచ్

లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం ఆ ఆనందంగా ఉంది. సుమన్ గారికి కృతజ్ఞతలు. 

లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ.. లక్మీ రాయ్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ట్రైలర్ చూశాను. ఫైట్స్ ఆదరగొట్టారు. తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి చిత్రాలకు మంచి థియేటర్స్ దొరకాలి. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించి నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. విజయశాంతి గారు నటించిన కర్తవ్యం, ఇలాంటి సినిమాలకు ఇన్స్పిరేషన్. ప్రతిఘటన చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించాలని కోరుతున్నాను అన్నారు.

ప్రముఖ డాన్సర్, నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ.. గతంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ లక్మీ రాయ్ నటించిన "ఝాన్సీ ఐపీఏస్" చిత్రానికి ప్రత్యేకత ఉంది. మూడు పాత్రల్లో అద్భుతంగా నటించారు లక్మీ రాయ్. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు జెవిఆర్ మాట్లాడుతూ..ఆర్కే ఫిల్మ్స్ పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్న "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సదాశివ రెడ్డి, భాస్కర్ రావు, హీరో కిరణ్, అగర్వాల్, జి ఏస్ రెడ్డి, లక్మి , దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments