హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న"లోపలికి రా చెప్తా" మూవీ 'మిషన్ కుట్టేటి సుందరి' సాంగ్

మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా  నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ "లోపలికి రా చెప్తా".  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

రీసెంట్ గా "లోపలికి రా చెప్తా" సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మిషన్ కుట్టేటి సుందరి' సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు అలరాజు రాసిన లిరిక్స్, డేవ్ జాండ్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్యూన్, వెంకట రాజేంద్ర పాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ఈ పాట సక్సెస్ నేపథ్యంలో మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా తమ "లోపలికి రా చెప్తా". సినిమా ఉంటుందని, త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.


నటీనటులు - కొండా వెంకట రాజేంద్ర ,మనీషా జష్ణాని , సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి ,వాణి ఐడా, తదితరులు 

టెక్నికల్ టీమ్

మ్యూజిక్: డేవ్ జాండ్
డీవోపీ: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్
ఎడిటర్: వంశీ
ప్రొడ్యూసర్: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర 
కథ , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర
 పి ఆర్ ఓ: బి. వీరబాబు

No comments